
పిట్లం, వెలుగు: కొత్తగా ఎంపికైన పిట్లం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం లక్ష్మీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్క్లబ్ మాజీ గవర్నర్ వీటీ రాజ్కుమార్ నూతన కార్యవర్గ సభ్యులకు వారి పదవీ బాధ్యతలను వివరించి ప్రమాణం చేయించారు. క్లబ్ అధ్యక్షుడిగా మున్నూరు నారాయణ, సెక్రెటరీగా బి. బాలు, కోశాధికారిగా మారుతిరెడ్డి, కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. పిట్లం లయన్స్క్లబ్ 20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా ఉత్తమ క్లబ్గా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. క్లబ్లోకి కొత్తగా చేరిన నలుగురు సభ్యులతో లయన్స్క్లబ్రీజియన్ చైర్మన్ అనితారెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో క్లబ్డిస్టిక్ పీఆర్వో అనంత్రెడ్డి, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, వేణుగోపాల్, కిషన్, లక్ష్మీనారాయణ, అబిద్హుస్సేన్ పాల్గొన్నారు.