భారతీయ అడ్వర్టైజ్ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యాడ్ లెజెండ్ పియూష్ పాండే (Piyush Pandey) కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. అబ్కీ బార్ మోడీ సర్కార్ నుంచి వోడాఫోన్ జూజూస్ వరకు భారతీయ యాడ్స్ రూపొందించి అడ్వర్టైజ్ మెంట్ రంగంలో లెజెండ్ అనిపించుకున్నారు పియూష్ పాండే.ఆయన మరణం ప్రకటనల ప్రపంచంలోనే కాకుండా, మొత్తం క్రియేటివ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అడ్వర్ టైజ్ మెంట్ రంగంలో ప్రసిద్దులు.. అడ్వర్టైజ్ మెంట్ దిగ్గజం , పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్ పాండే (70) ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండే ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం (అక్టోబర్24) ఉదయం తుదిశ్వాస విడిచారు. పాండే మరణవార్తను ఆయన సోదరి నటి ఇలా అరుణ్ధృవీకరించారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహించనున్నారు.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో..పాండే భారతీయ అడ్వర్టైజ్మెంట్ రంగంలో రాణించారు. ప్రకటనలకు కంటెంట్ అందించారు. వాయిస్ ఓవర్ ఇచ్చారు. యాడ్స్ లో నటించారు. దేశంలో అత్యంత గుర్తింపు పొందిన ప్రకటనలను రూపొందించారు.
మనం టీవీల్లో చూసే ఫెవికాల్ యాడ్, ఏషియల్ మెంట్ యాడ్, క్యాడ్ బరీ డైరీ మిల్క్, వోడాఫోన్ కు ది పగ్ , జూజూస్,బజాజ్ కంపెనీకి - 'హమారా బజాజ్, 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడిన నినాదం అబ్కీబార్ మోదీ సర్కార్ నినాదం వంటి ప్రముఖ యాడ్ కంటెంట్ ను అందించారు పీయూష్ పాండే.
ఫెవికాల్ - బలమైన బంధాలకు చిహ్నం అంటూ ఫెవికాల్ యాడ్, హర్ ఘర్ కుచ్ కెహ్తాహై అంటూ ఏషియన్ పెయింట్స్, తోడో నహీన్ జోడో ప్రచార నినాదంతో ఫెవిక్విక్ వంటి కంపెనీలకు యాడ్స్ కంటెంట్ రూపొందించారు పీయూష్ పాండే.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కీరోల్ పోషించిన ఎన్నికల ప్రచార నినాదం.. అబ్కీ బార్ మోడీ సర్కార్ ను రూపొందించిని పీయూష్ పాండేనే. ఆయన క్రియేట్ చేసిన పొలిటికల్ రచనల్లో అత్యంత ప్రాధాన్యత పొందింది. ఈ వాక్యం దేశవ్యాప్తంగా ఓ పల్లవిగా మారింది .భారత రాజకీయ కమ్యూనికేషన్లో ఓ మలుపు తిప్పింది. ప్రజాభిప్రాయాన్ని పదునైన సందేశంతో మిళితం చేసింది. రాజకీయ భావాలను సరళమైన, చిరస్మరణీయ నినాదంగా అనువదించగల అతని సామర్థ్యం.. భారతీయ ప్రేక్షకుల పట్ల అతని సాటిలేని అవగాహనను ప్రదర్శించింది.
ప్రముఖ రంగుల కంపెనీ ఏషియన్ పెయింట్స్ కు కూడా అడ్వర్టైజ్ మెంట్లు రూపొందించింది పీయూష్ పాండేనే. హర్ ఘర్ కుచ్ కెహ్తా హై" అనేది పీయూస్ చేసిన అత్యంత భావోద్వేగం ప్రతిధ్వనించే రచనలలో ఒకటి. ప్రతి ఇల్లు ఒక కథ చెబుతుందనే ఆలోచనపై ఈ ప్రకటనలు భారతదేశం అంతటా కుటుంబాలు ,ఇంటి యజమానులమనుసులలోకి లోతుగా వెళ్లింది.ఈ అడ్వర్టైజ్ మెంట్ రచనతో ఆసియన్ పెయింట్స్ను బ్రాండ్ కంపెనీగా మారింది.
