కెనడాలో కూలిన విమానం.. ఇండియన్ ​ట్రైనీ పైలెట్లు మృతి

కెనడాలో కూలిన విమానం.. ఇండియన్ ​ట్రైనీ పైలెట్లు మృతి

ఒట్టావ: కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు ఇండియన్​ ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మృతి చెందారు. పీఏ 34 సెనెకా అనే డబుల్ ​ఇంజిన్ ​లైటె ఎయిర్​క్రాఫ్ట్​వాంకోవర్​కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్ ​సమీపంలోని ఓ హోటల్ ​వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. 

కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ ట్రైనీ పైలెట్లు అభయ్​గద్రూ, యస్​ విజయ్ ​రాముగదే లది ముంబై. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని లోకల్ ​మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కెనడా ట్రాన్స్​పోర్టేషన్​ సెఫ్టీ బోర్డు విచారణ జరుపుతున్నది.