ఒట్టావ: కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు ఇండియన్ ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మృతి చెందారు. పీఏ 34 సెనెకా అనే డబుల్ ఇంజిన్ లైటె ఎయిర్క్రాఫ్ట్వాంకోవర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇండియన్ ట్రైనీ పైలెట్లు అభయ్గద్రూ, యస్ విజయ్ రాముగదే లది ముంబై. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని లోకల్ మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కెనడా ట్రాన్స్పోర్టేషన్ సెఫ్టీ బోర్డు విచారణ జరుపుతున్నది.