
నస్పూర్, వెలుగు: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఎస్ఆర్పీ ఓసీపీని సందర్శించారు. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 35 లక్షల బొగ్గు ఉత్పత్తిని రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సాధించాలని చెప్పారు. ఎస్వోటూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఎస్ఆర్పీ ఓసీపీ పీవో వెంకటేశ్వర్లు, ఐకే ఓసీపీ పీవో వెంకటేశ్వర రెడ్డి, గని మేనేజర్ శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజినీర్ నాగరాజు తదితరులున్నారు.
టాప్ లోడింగ్ సిస్టం ప్రారంభం
జైపూర్,వెలుగు: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకెళ్లాలని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఐకే కే 1 ఏ గనిని జీఎం శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. గని ఆవరణ లోని బలరామ జలధి వద్ద మొక్కలు నాటి, ఓపెన్ కాస్ట్ డీజిల్ బంక్ లో టాప్ లోడింగ్ సిస్టంను ప్రారంభించారు. గుర్తింపు సంఘం కార్యదర్శి బాజీ సైదా, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.