
హైదరాబాద్, వెలుగు: ప్లాటినం ఎవారా మహిళలకోసం రూపొందించిన ప్లాటినం నగలను అందుబాటులోకి తెచ్చింది. ఈప్రత్యేక నగలు మనదేశంలోని ప్రముఖ జ్యువెలరీ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి 95 శాతం స్వచ్ఛమైన ప్లాటినం నుంచి తయారయ్యాయని సంస్థ తెలిపింది. ఈ కలెక్షన్లో ఆకర్షణీయమైన నెక్లెస్లు, చెవిపోగులు, ఉంగరాలు ఉన్నాయి. రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్కు ఇవి అనువుగా ఉంటాయని ఎవారా తెలిపింది.