
లండన్: యాషెస్ టెస్టు సిరీస్ను 3–1తో కైవసం చేసుకునేందుకు ఆస్ట్రేలియా మరో 249 రన్స్ దూరంలో నిలిచింది. ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఇచ్చిన 384 రన్స్ టార్గెట్ ఛేజింగ్ కోసం బరిలోకి దిగిన ఆసీస్ నాలుగో రోజు ఆదివారం ఆట చివరకు 135/0 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ (69 బ్యాటింగ్), డేవిడ్ వార్నర్ (58 బ్యాటింగ్) ఆసీస్ విజయానికి బలమైన పునాది వేశారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 389/9తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ మరో ఆరు రన్స్ మాత్రమే చేసి 395 స్కోరు వద్ద ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్కు వచ్చిన ఆసీస్కు వార్నర్, ఖవాజ మెరుపు ఆరంభం ఇచ్చారు. అయితే రెండో సెషన్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత వర్షం వల్ల ఆట సాధ్యం కాలేదు. సోమవారం మ్యాచ్కు చివరి రోజు. కాగా, ఈ టెస్టుతో క్రికెట్కు వీడ్కోలు పలకనున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ను ఆసీస్ నాలుగో రోజు ఆటకు ముందు గార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించింది.