
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్ కు రైతుల వినతి
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోతున్న గోలేటి, సోనాపూర్ రైతులకు ఎకరాకు 60 లక్షలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని మంగళవారం హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్ కు రైతులు వినతిపత్రాలు అందజేశారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ పేరుతో భూమి తీసుకుంటున్న రైతులకు ఎకరాకు భూ భారతి ప్రకారం మార్కెట్ లో రూ.20లక్షల కంటే తక్కువ లేదని పేర్కొన్నారు. గోలేటి లో రిజిస్ట్రేషన్ వాల్యూషన్ విలువ సాధారంగా రూ. 20 లక్షల వరకు ఉందని తెలిపారు. బయట మార్కెట్ లో ఎకరానికి రూ.20లక్షలు ఉందని, సింగరేణి మాత్రం రూ.7.56 లక్షలు అవార్డు ప్రకటించి రైతులను తీవ్ర నష్టానికి గురి చేసి మోగించిందని వాపోయారు. న్యాయం చేయకుంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు.