కొత్త పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ

కొత్త పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ

దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్  మార్గ్ లో కొత్త పార్లమెంట్  భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. శంకుస్థాపన కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్  హరివంశ్  నారాయణసింగ్ తో పాటు మొత్తం 200 మంది అతిథులు హాజరయ్యారని తెలిపారు అధికారులు.  దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం తెలిపింది.

శంకుస్థాపన చేయనున్న ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. నూతన భవనాన్ని రూపొందిస్తున్నారు. విశాలమైన సెంట్రల్‌ కాన్‌స్టిట్యూషన్‌ గ్యాలరీ సామాన్య ప్రజల సందర్శనార్థం అనుమతి కల్పించనున్నారు.