ఆసియాన్ సదస్సుకు ప్రధాని దూరం.. వర్చువల్గా హాజరుకానున్న మోదీ

ఆసియాన్ సదస్సుకు ప్రధాని దూరం..   వర్చువల్గా హాజరుకానున్న మోదీ

న్యూఢిల్లీ: మలేషియాలోని కౌలాలంపూర్​లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సమిట్‌ కు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. షెడ్యూల్ సమస్యల వల్లే సదస్సుకు ప్రధాని హాజరుకావడం లేదని.. అయితే, ఆయన వర్చువల్​గా సమిట్​లో పాల్గొంటారని కేంద్ర వర్గాలు తెలిపాయి. భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమిట్‌ కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ లేనట్టేనని స్పష్టమైంది. అయితే, ఆసియాన్ కు  మోదీ గైర్హాజరుపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవకూడదనే  మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇటీవల ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా ఆయన  అటెండ్ ​కాలేదన్నారు.