దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర

 దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర

ఢిల్లీ జ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఆదివారం జరిగిన ‘డిపాజిటర్స్‌ ఫస్ట్‌’ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... భారత్ లో ఏళ్ల తరబడి సమస్యలు చాపకింద నీరుగార్చే ధోరణి  నెలకొని ఉంది.కానీ నేటి న్యూ ఇండియా సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడంపై దృష్టి పెడుతుందన్నారు. వాటి పరిష్కారం ఆలస్యం కాదన్నారు ప్రధాని. ప్రపంచ  ఆర్థిక వ్యవస్థకు  భారతదేశం దిక్సూచిలా  మారే సమయం  వచ్చిందన్నారు RBI గవర్నర్ శక్తికాంత దాస్.   అయితే బ్యాంకింగ్   రంగంలో  అందరూ  కలిసి  పనిచేస్తేసే  భారత్ శక్తివంతంగా  ఎదుగుతుందని  చెప్పారు. కరోనా  మహమ్మారి సమయంలో  దేశం మొత్తం కలిసి పనిచేసిందని  ఢిల్లీలో  బ్యాంక్ డిపాజిట్ల  ఇన్సూరెన్స్  ప్రోగ్రాంలో తెలిపారు. 

డిపాజిట్‌ బీమా విషయంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఖాతాదారుల విశ్వాసాన్ని పెంచుతాయన్నారు ప్రధాని.  డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌  (డీఐసీజీసీ) సవరణ బిల్లుకు ఆగస్టులో పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. డీఐసీజీసీ చట్టాన్ని సవరించిన తర్వాత.. దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి, ఖాతాను స్తంభింపచేసినప్పుడు.. రూ.5లక్షల వరకూ నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసిందని ప్రధాని వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర రాష్ట్రాల సహకార బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరంట్, రికరింగ్ డిపాజిట్లకు ఈ ఇన్సురెన్స్ పథకం వర్తించనుంది. 

బ్యాంకు డిపాజిట్ బీమా కవరేజీని పెంచాలని తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవాడినని, కానీ ఫలితం లేకపోయిందని, ఆ పని చేయడం కోసమే తనను ప్రజలు ప్రధాన మంత్రిని చేశారని నరేంద్ర మోదీ అన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచామని, దీని వల్ల ఒకవేళ బ్యాంకులు దివాలా తీసినా లేదా నష్టాల్లో నడుస్తున్నా డిపాజిటర్ల సొమ్ములో రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ భద్రత ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ఆర్‌బీఐ మారటోరియం విధించిన మరికొన్ని బ్యాంకుల ఖాతాదారులకు కూడా త్వరలో బీమా సొమ్ము అందనుందన్నారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకులను రక్షించుకోవాలంటే.. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.