సూరత్: డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ ప్రాజెక్ట్ పూర్తయితే.. ప్రపంచానికే సూరత్, డైమండ్ ట్రేడింగ్ హబ్గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరల్డ్వైడ్గా ఉన్న డైమండ్ మర్చంట్స్, కంపెనీలు సూరత్లో ఆఫీసులు ఓపెన్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ ఫేజ్–1 పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ గురువారం శంకుస్థాపన చేశారు. దీనికి ముందు భావ్నగర్ సిటీ, సూరత్లోని లింబాయత్ ఏరియాలో భారీ రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూరత్లో రూ.3,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఖజోడ్ విలేజ్కు దగ్గర్లో రెండున్నర ఎకరాల్లో డ్రీమ్ సిటీ ప్రాజెక్టు చేపడుతున్నట్టు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్కు టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్టు చేసేందుకు సూరత్ – వారణాసి మధ్య స్పెషల్ ట్రైన్ నడిపించేందుకు ఇండియన్ రైల్వేస్ ప్లాన్ చేస్తున్నదన్నారు.
20ఏండ్లలో ఎంతో అభివృద్ధి
20ఏండ్లలో సూరత్ చాలా డెవలప్ అయ్యిందని మోడీ అన్నారు. ‘‘గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సూరత్కు ఏయిర్పోర్టు తీసుకొద్దామనుకున్న. కేంద్రంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ను కన్విన్స్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఏయిర్పోర్టు ఎందుకు అవసరమో వివరించాల్సి వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్ మ్యాటర్లో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి”అని మోడీ గుర్తు చేశారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటంతో.. ఎలాంటి అప్రూవల్స్ అయినా వేగంగా పూర్తవుతున్నాయన్నారు. సూరత్లో కొత్త గవర్నమెంట్ స్కూల్స్, సైన్స్ మ్యూజియం, లైబ్రరీలు, ఫైర్స్టేషన్లు, మెడికల్ స్టూడెంట్స్ కోసం హాస్టల్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 25 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్ కోసం శంకుస్థాపన చేశామన్నారు. తర్వాత సాయంత్రం అహ్మదాబాద్సిటీలోని మోతేరా స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా జీఎండీసీ మైదానంలో గుజరాత్ గవర్నమెంట్ నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో మోడీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.