
న్యూఢిల్లీ: కరోనాపై ఫైట్ చేయడంలో ప్రపంచంలోనే మన ప్రధాని మోడీ నెంబర్ వన్ అంటూ పోల్స్టర్ మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. ఏప్రిల్ 14న ప్రపంచ దేశాల నేతలకు వచ్చిన రేటింగ్స్ను ఈ సంస్థ విడుదల చేసింది. ఇందులో మోడీకి అత్యధిక రేటింగ్ దక్కిందని తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, అత్యధిక జనాభాను మోడీ చాలా చక్కగా డీల్ చేశారని పేర్కొంది. తబ్లిగి వంటి సంఘటన జరిగినా.. ఆ మీటింగ్ కు హాజరైన వారు ఆచూకీ కోసం ప్రయత్నించాల్సి వచ్చినా ప్రభుత్వ చర్యలు బాగున్నాయని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనాను సమర్థంగా అడ్డుకున్నారంది. సంస్థ పోల్ లో మోడీకి లభించిన రేటింగ్ 68 కాగా.. ఆయన తర్వాత ఒబ్రెడార్ (మెక్సికో)కు 36 పాయింట్ల రేటింగ్ దక్కింది. తర్వాతి స్థానాల్లో జాన్సన్(యూకే) 35, స్కాట్ మారిసన్ (ఆస్ట్రేలియా) 26, ట్రూడో (కెనడా) 21, మెర్కెల్ (జర్మనీ) 16 రేటింగ్ దక్కగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు దక్కిన రేటింగ్ -3 అని సంస్థ తెలిపింది.