10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 20వేల కోట్లు

10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 20వేల కోట్లు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు 10వ విడత ఆర్థిక సాయం విడుదల చేసింది. 10 కోట్ల మంది రైతుల ఖాతాలో 20వేల కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.6 లక్షల కోట్లు  బ్యాంక్ ఖాతాలో చేశారు. ఈపథకం కింద అర్హులైన రైతు  కుటుంబానికి కేంద్రం రూ.6 వేలు జమ చేస్తోంది. రెండువేల రూపాయల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఈ మొత్తాన్ని కేంద్ర సర్కార్ జమచేయనుంది.   వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయమంత్రి తోమార్ పాటు.. తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.