
నాగ్పూర్: ఆత్మనిర్భర్ భారత్ కోసం సైన్స్ను వాడుకోవాలని, ఆ దిశగా పరిశోధకులు ముందడుగు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రోజువారీ జీవితంలో మార్పు తీసుకొచ్చేలా సైన్స్ను మార్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘సైన్స్ అనేది ల్యాబ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. దాని ప్రభావం అట్టడుగు స్థాయికి చేరుతుంది. దాని పరిధి జర్నల్ నుంచి జమీన్కు మారాలి. రీసెర్చ్ అనేది నిజ జీవితంలోకి వచ్చినప్పుడే మార్పు కనిపిస్తుంది” అని మోడీ అన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని రాష్ట్రసంత్ తుకాదోజీ మహారాజ్ నాగ్పూర్ వర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108వ సదస్సును ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ కొష్యారీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జితేందర్సింగ్, మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త టెక్నాలజీపై ఫోకస్ చేయాలి
శాస్త్రీయ ప్రక్రియలపై ఫోకస్ పెట్టాలని, ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీస్, డేటా సైన్సెస్, వ్యాక్సిన్ల తయారీ, రీసెర్చ్పై యువతను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ చెప్పారు. కాగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాల ని, అలాగే సెమీకండక్టర్ల రంగంలో ఇన్నోవేషన్స్ అవస రం ఉందని, ఈ రంగంలో దేశ భవిష్యత్తు అవసరాలు తీర్చేలా ఆలోచనలు చేయాలని చెప్పారు.