
బీజేపీ పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు లోక్సభ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు 303 స్థానాలకు చేరుకుందన్నారు. తూర్పు నుండి పడమర వరకు.. ఉత్తరం నుండి దక్షిణం వరకు బీజేపీ పాన్-ఇండియా పార్టీగా అవతరించిందని చెప్పారు. యువత అభివృద్ధి చెందడానికి బీజేపీ అవకాశం ఇస్తుందన్నారు. బీజేపీ ఫ్యామిలీ పార్టీ కాదని.. ప్రజల పార్టీ అని వెల్లడించారు.
https://twitter.com/ANI/status/1640723469640802312
ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ను మోడీ ప్రారంభించారు. ఈ భవనాల సముదాయం కాదని.. బీజేపీ సేవకు చిహ్నం అని అన్నారు. ప్రతికార్యకర్తకు ఈ భవనాలు అంకితమని చెప్పారు. దేశం ముందు అనేక లక్ష్యాలున్నాయని అన్నారు.ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించిన మోడీ..ఆ చీకటి అధ్యాయనాన్ని దేశంఎప్పటికీ మరచిపోదన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందని విమర్శించారు.