బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశం..వేదికపై త్రివర్ణ పతాకానికి ప్రధాని మోదీ రెస్పెక్ట్

బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశం..వేదికపై త్రివర్ణ పతాకానికి ప్రధాని మోదీ రెస్పెక్ట్

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బుధవారం జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశంచోటు చేసుకుంది. సమావేశంలో వేదికపై నిలబడి ఉన్న స్థానాన్ని సూచించడానికి, ప్రతి నాయకుడి స్థలం దేశం జెండాతో గుర్తించబడింది.  వేదికపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రధాని మోదీ దానిపై అడుగు పెట్టకుండా ఉండేందుకు జెండాను ఎత్తి జేబులో పెట్టుకున్నారు. ప్రధాని మోదీ తోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన రమాఫోసా తన దేశ జెండాతో కూడా అదే పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ సంకేతం త్రివర్ణ పతాకం పట్ల ప్రధాని మోదీకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు అంటున్నారు.