కేదార్ నాథ్‎ పర్యటనలో ప్రధాని మోడీ

కేదార్ నాథ్‎ పర్యటనలో ప్రధాని మోడీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్‎లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొత్తగా పునర్నిర్మించిన ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ. 130 కోట్లతో నిర్మించిన సరస్వతి రిటైనింగ్ వాల్, ఘాట్లు, మందాకిని రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్ హౌస్‎లు, మందాకిని నదిపై నిర్మించిన గరుడ్ చట్టి వంతెనలను మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని టూర్‎తో కేదార్ నాథ్‎‎తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఉత్తరాఖండ్‎లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దాంతో మోడీ కేదార్ నాథ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన కేదార్ నాథ్ సందర్శించడం ఇది రెండోసారి. 2019లోను ఆలయాన్ని విజిట్ చేసి.. ప్రత్యేక పూజలు చేశారు.