ప్రధాని మోడీ ఇవాళ సౌదీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటిస్తారు. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానంతో సౌదీకి పయనమయ్యారు. ఈ పర్యటనలో మోడీ సౌదీ రాజుతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశముంది. పర్యటనలో భాగంగా సౌదీ రాజుతో కలిసి మోడీ రూపే కార్డును లాంచ్ చేయనున్నారు.
మరోవైపు మోడీ.. సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చింది. మోడీ ప్రయాణం చేసే విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లో మానవహక్కులను ఉల్లఘించిదన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా మీడియాకు తెలిపారు. అంతేకాదు అనుమతి నిరాకరణకు సంబంధించిన విషయాన్ని లిఖిత పూర్వకంగా భారత హైకమిషనర్కు తెలియజేయనున్నట్లు తెలిపారు.