మత్స్య ఎడిషన్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని

మత్స్య ఎడిషన్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ(గురువారం,సెప్టెంబర్-10) రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. మత్య్సకారుల కోసం పీఎం మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ గోపాల యాప్‌ను ప్రారంభించారు. మత్స్యకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మోడీ. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది లక్ష్యం. ఫిషరీస్ శాఖకు బూస్ట్ ఇవ్వడానికి  ఉపయోగపడుతుందన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన అనేది శ్వేతవిప్లవం లాగా తీపి విప్లవానికి పునాది వేస్తుందన్నారు. అంతేకాదు దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈ గోపాల యాప్ ద్వారా పాల ఉత్పత్తిదారులకు లబ్ది చేకూరుతుందన్నారు మోడీ.