ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ పథ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో మోడీ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి ఆయన తలపై టోపీ, మెడలో మఫ్లర్ తో సరికొత్త డ్రెస్సింగ్ లో కనిపించారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో మోడీ బ్రహ్మకమలం డిజైన్ ఉన్న ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ ప్రజలు ధరించే సంప్రదాయ చేనేత మఫ్లర్ ధరించారు. త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు వాటిని ధరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మోడీ ఉత్తరాఖండ్ టోపీ ధరించడంపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి సంతోషం వ్యక్తం చేశారు. 1.25కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. మోడీ మణిపూర్ మఫ్లర్ ధరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిస్వజిత్ సింగ్ సైతం సంతోషం వ్యక్తం చేశారు.
आज 73वें गणतंत्र दिवस के अवसर पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने ब्रह्मकमल से सुसज्जित देवभूमि उत्तराखण्ड की टोपी धारण कर हमारे राज्य की संस्कृति एवं परम्परा को गौरवान्वित किया है। #RepublicDay pic.twitter.com/9JDnZMHG7B
— Pushkar Singh Dhami (@pushkardhami) January 26, 2022
Moment of great pride and honour for entire #Manipur on seeing Adarniya PM @NarendraModi Ji wearing a Manipuri stole 'Leirum Phee' on the glorious occasion of 73rd Republic Day of India, showcasing the exquisite tradition of the state. pic.twitter.com/DfltZ8TBsa
— Th.Biswajit Singh (@BiswajitThongam) January 26, 2022