ఆయన మరణం దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు

ఆయన మరణం దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు

న్యూఢిల్లీ: బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.అనారోగ్యంతో బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ ఆదివారం నాడు మరణించిన విషయం తెలిసిందే. సౌమిత్రా ఛటర్జీ మరణం ప్రపంచానికి పశ్చిమబెంగాల్, భారత దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఛటర్జీ మరణంతో తనను తీవ్ర విచారంలో ముంచెత్తిందని ఆయన చెప్పారు. ఛటర్జీ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

అక్టోబర్ 6న సౌమిత్రా ఛటర్జీకి కరోనా పాజిటివ్‌‌గా తేలింది. గత నెల రోజులుగా కోల్‌‌కతాలోని బెల్లెవ్యూ నర్సింగ్ హోమ్‌‌లో చేరాడు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత కూడ ఆయన అనారోగ్యం నుండి కోలుకోలేదని డాక్ట‌ర్లు చెప్పారు.