మోదీ యూట్యూబ్ చానల్​కు 2 కోట్ల మంది సబ్‌‌ స్ర్కైబర్లు

మోదీ యూట్యూబ్ చానల్​కు 2 కోట్ల మంది సబ్‌‌ స్ర్కైబర్లు

న్యూఢిల్లీ :  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ యూట్యూబ్ చానల్‌‌ సబ్‌‌ స్ర్కైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో దేశాధినేత‌‌ల్లో అత్యధిక స‌‌బ్‌‌ స్ర్కైబర్లు ఉన్న లీడ‌‌ర్‌‌గా మోదీ నిలిచారు. అలాగే, ప్రపంచ నేత‌‌ల్లో ఎవ‌‌రూ కూడా ఆయ‌‌న ద‌‌రిదాపుల్లోలేరు. మోదీ తన చానల్‌‌లో పోస్ట్ చేసిన వీడియోలు 450 కోట్లకు పైగా వ్యూస్​ కలిగి ఉన్నాయి. బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్సనారో 64 లక్షల మంది స‌‌బ్‌‌ స్ర్కైబర్లతో రెండో స్థానంలో ఉన్నారు. వ్యూస్​పరంగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ 22.4 కోట్లతో మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌కు 7.89 లక్షల మంది సబ్‌‌ స్ర్కైబర్లు ఉన్నారు.