స్టూడెంట్ల సామర్థ్యాలు వెలికితీసేందుకు యాప్: పీవో ప్రతీక్​జైన్

స్టూడెంట్ల సామర్థ్యాలు వెలికితీసేందుకు యాప్: పీవో ప్రతీక్​జైన్

భద్రాచలం,వెలుగు: విద్యార్ధుల సామర్ధ్యాలను వెలికితీసేందుకు, టీచర్లకు  ఉపయోగపడేందుకు ప్రత్యేకంగా యాప్​ను రూపొందిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్​ చెప్పారు.  భద్రాచలం ఐటీడీఏలో ఖమ్మం జిల్లాలోని గురుకులం, ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపల్స్​, హెచ్​ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  విద్యార్ధుల సామర్ధ్యాలను అంచనా వేసేందుకు వారికి పలు సూచనలు చేశారు. 2021లో వచ్చిన కరోనా కారణంగా విద్యార్ధులు కొంత వెనుకబడ్డారని  అన్నారు.

 పిల్లలకు  ఇష్టం పెరిగేలా  చదువు చెప్పాలన్నారు.  ఒక్కో టీచర్​కు 50 మంది విద్యార్ధులను కేటాయిస్తామని, వారంతా   యాప్​లో సూచించిన పద్దతుల్లో  బోధన చేయాలని తెలిపారు.  పదో తరగతి పిల్లలకు వంద రోజుల ప్రణాళిక రూపొందించి  కమిషనరేట్​ నుంచి మెటీరియల్​ సరఫరా చేస్తున్నారని, దాని ప్రకారం వారిని పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్​, డీడీ మణెమ్మ తదితరులు  పాల్గొన్నారు.