పోలవరం వరద సమాచారం ఇవ్వాలి: పీపీఏకు తెలంగాణ లేఖ

పోలవరం వరద సమాచారం ఇవ్వాలి: పీపీఏకు తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు వద్ద వరద తీవ్రతపై ఎగువ రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇరిగేషన్​ఈఎన్సీ మురళీధర్ గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ(​పీపీఏ) సీఈవోకు లేఖ రాశారు. జులై 21 నుంచి 30వ తేదీ వరకు భద్రాచలం వద్ద గోదావరిలో వరద తీవ్రత 9.71 లక్షల క్యూసెక్కుల నుంచి 15.97 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. 2014 మే 28న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అను మతులు ఇచ్చిందని, అదే సమయంలో పోల వరం ప్రాజెక్టు అథారిటీకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద పోటెత్తినప్పుడు ప్రతి గంటకు  సమాచారం ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు.