సర్కారు స్కూళ్లలో సౌలతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు స్టూడెంట్ యూనియన్ల నేతలు హైదరాబాద్లోని మంత్రుల ఇండ్ల ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈడ్చుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. దాదాపు 60 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులను వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని స్టూడెంట్ యూనియన్లు నిర్ణయించాయి.