స్టూడెంట్లపై ఉక్కుపాదం

స్టూడెంట్లపై ఉక్కుపాదం

సర్కారు స్కూళ్లలో సౌలతులు కల్పించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం పలు స్టూడెంట్​ యూనియన్ల  నేతలు హైదరాబాద్​లోని మంత్రుల ఇండ్ల ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈడ్చుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. దాదాపు 60 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అరెస్టులను వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని స్టూడెంట్​ యూనియన్లు నిర్ణయించాయి.