ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు

ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు

పెద్దపల్లి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కంప్లైంట్ చేసిన వ్యక్తినే అరెస్ట్ చేశారు. సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో రైతుబంధు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. దాంతో గ్రామంలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. దాంతో గ్రామానికి చెందిన ఒజ్జ సతీష్ అనే బీజేపీ కార్యకర్త డయల్ 100కు ఫోన్ చేశాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమ గ్రామంలో ర్యాలీ, సభలు నిర్వహించొద్దని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రైతుబంధు వేడుకలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి.. అక్కడున్న సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. కరోనా వ్యాపిస్తుందనే భయంతో ఫిర్యాదు చేస్తే తనను అరెస్ట్ చేయడమేంటని సతీష్ పోలీసులను ప్రశ్నించాడు. బండి సంజయ్ జాగరణ దీక్షకు ఉన్న కరోనా నిబంధనలు.. రైతుబంధు వారోత్సవాలకు వర్తించవా? ఇదెక్కడి న్యాయం? అని సతీష్ ప్రశ్నించాడు.

For More News..

సోషల్ మీడియా టీఆర్ఎస్ సొంతమా?

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం

ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ