కౌలాలంపూర్: వివాదాస్పద మత బోధకుడు జకీర్నాయక్ పబ్లిక్స్పీచ్లను మలేషియా పోలీసులు బ్యాన్ చేశారు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ స్పీచ్లు ఇవ్వొద్దంటూ వార్నింగ్ఇచ్చారు. ఆయన స్పీచ్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో, నేషనల్సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా పోలీస్బాస్దాతుక్అస్మావతి అహ్మద్చెప్పారు. ఈమధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జకీర్దేశంలోని పలు వర్గాలను రెచ్చగొట్టే కామెంట్స్చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మలేషియాలోని హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం జకీర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దాదాపు 10 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఆ తర్వాత ఇకపై స్పీచ్లు ఇవ్వొద్దని జకీర్కు వార్నింగ్ఇచ్చారు. ఈ వ్యవహారంపై మలేషియా ప్రధాని డాక్టర్మహతిర్మొహమ్మద్స్పందించారు. జకీర్తన పరిమితులు దాటి రెసిడెన్సీ హోదాను సంశయంలో పడేసుకున్నారని కామెంట్చేశారు. ఇండియాలో టెర్రర్కార్యకలాపాలకు జకీర్ఆర్థిక సాయం అందించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఎన్ఐఏ కేసు ఫైల్చేయడంతో మలేషియా పారిపోయి ఆశ్రయం పొందాడు. కేంద్ర ప్రభుత్వం జకీర్పాస్పోర్టును రద్దుచేసి, ఆయన ఆస్తులను జఫ్తు చేసింది. జకీర్ను తమకు అప్పగించాలంటూ మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. పర్మినెంట్రెసిడెన్సీ పొందిన జకీర్పై ఎలాంటి నేరారోపణలు లేకపోవడంతో అప్పగించలేమని మలేషియా పేర్కొంది. తాజా ఫిర్యాదుల నేపథ్యంలో జకీర్రెసిడెన్సీ హోదాను కేన్సిల్చేసి, ఆయనను ఇండియాకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.