
ఇద్దరు బాలికలను ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్న ఓటీవీ యాంకర్ పై పోలీసుకేసు నమోదైంది. శిశు సంక్షేమ కమిటీ(CWC) ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నూజివీడులోని చైల్డ్ కేర్లో చదువుకుంటున్న ఇద్దరు బాలికలను పండుగ సెలవులు వచ్చినప్పుడు వాళ్ల తల్లి హైదరాబాద్కు తీసుకొచ్చింది. దీంతో పాటు ఓ టీవీయాంకర్ ఇంట్లో పనిలో పెట్టింది. అయితే సెలవులు పూర్తైనా పిల్లలు తిరిగిరాకపోయే సరికి సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేయగా… హైదరాబాద్లోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. పిల్లలతో ఇంటిపని, బాడీ మసాజ్ లాంటి పనులు యాంకర్ చేయించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో సదరు యాంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.