- ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో..
ఆసిఫాబాద్, వెలుగు: ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆసిఫాబాద్ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్తో కలెక్టరేట్, కోర్టు, బస్టాండ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.
