కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న అటవీ గ్రామాల్లో మళ్లీ నక్సల్స్అలజడి నెలకొంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తుండగా దాన్ని తిప్పికొట్టేందుకు పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్నిర్వహిస్తున్నారు. ఇటీవల చత్తీస్ గఢ్రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో జరిగిన భారీ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రహార్సైనిక దాడులకు నిరసనగా సోమవారం మావోయిస్టులు భారత్బంద్నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కూడా బంద్ను సక్సెస్చేయాలని ఇటీవల మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ప్రకటన విడుదల చేయడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ, చత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో మావోయిస్టులు ఏదైనా ఘటనలకు పాల్పడుతారనే అనుమానంతో పికెటింగ్ఏర్పాటు చేసి తనిఖీలను చేపడుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే ఎవరూ ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నక్సల్స్కు టార్గెట్గా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలు, రాజకీయ నాయకులు గ్రామాల్లో ఉండవద్దని, సేఫ్జోన్కు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
సమాచారమిస్తే బహుమతి
నక్సలైట్లు జిల్లాలోకి ప్రవేశించారన్న సమాచారంతో వారి ఫోటోలతో కూడిన పోస్టర్ను బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తున్నారు. నక్సల్స్ప్రభావిత ప్రాంతాలైన మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల, కాళేశ్వరం, మల్హర్, కాటారం మండలాల్లోని అడవుల్లో మావోయిస్టులు కురుసం మంగు, దీపక్, మడకం సింగి, మంగ్లులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వారి ఫోటోలు, పేర్లతో పోస్టర్లు ప్రచురించారు. ‘సమాచారం మాకు- బహుమతి మీకు’ అంటూ ఆ వాల్ పోస్టర్లను పల్లెల్లో అంటిస్తున్నారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించినవారు, సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
స్పెషల్పార్టీ పోలీసులతో కూంబింగ్
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసులు అడవుల్లో భారీ కూంబింగ్ చేపట్టారు. నక్సల్స్ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెట్టూపుట్ట గాలిస్తున్నారు. కాటారం డీఎస్సీ బోనాల కిషన్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ సీఐల ఆధ్వర్యంలో ఎస్సైలు, స్పెషల్పార్టీ పోలీస్ బలగాలతో కూంబింగ్ముమ్మరం చేశారు. సమస్యాత్మక గ్రామాలపై డేగ కన్ను వేశారు. నక్సల్స్ నుంచి ఎలాంటి సమస్య ఎదురైనా తిప్పికొట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.
