సర్పంచ్ భర్తపై దుండగుల దాడి..మాటు వేసి కర్రలతో అటాక్

సర్పంచ్ భర్తపై దుండగుల దాడి..మాటు వేసి కర్రలతో అటాక్
  •     దుండగులను శిక్షించాలని గ్రామస్తుల ధర్నా

వికారాబాద్​, వెలుగు: తాజాగా సర్పంచ్​గా గెలిచిన ఓ మహిళ భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తాజాగా జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో వికారాబాద్​ జిల్లా కోట్పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్​గా సంగయ్య భార్య బసమ్మ గెలుపొందారు. కోటపల్లి మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్​లో చికిత్స పొందుతుండగా సంగయ్య కొంతమందితో కలిసి అక్కడికి వెళ్లి పరామర్శించారు. తిరిగి గురువారం రాత్రి 11 గంటలకు కోటిపల్లికి చేరుకున్నారు. 

ఆ సమయంలో అప్పటికే తన ఇంటి సమీపంలో మాటు వేసి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేశారు. కాలనీ వాసులు రావడంతో దుండగులు పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న సంగయ్యను హైదరాబాద్​ యశోద దవాఖానకు తరలించారు. ఆయన  పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దాడిని నిరసిస్తూ కోట్పల్లి మండలకేంద్రంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. వికారాబాద్​ డీఎస్​పీ శ్రీనివాస్​రెడ్డి, ధారూర్ సీఐ రఘురాములు ఘటనా స్థలాన్ని  పరిశీలించారు. దుండగులను త్వరగా పట్టుకుని శిక్షిస్తామని హామీ  ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా  విరమించారు. యశోదలో చికిత్స పొందుతున్న సంగయ్యను ఎమ్మెల్సీ  డాక్టర్​ మహేందర్ రెడ్డి, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్​ డాక్టర్​ మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్​ పరామర్శించారు.