బ్యాంకుల్లో దళారులు.. రైతుల వేషంలో పోలీసులు..30మంది దళారులు అరెస్ట్

బ్యాంకుల్లో దళారులు.. రైతుల వేషంలో పోలీసులు..30మంది దళారులు అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా బ్యాంకుల్లో దళారుల దందా జోరుగా సాగుతోంది. రుణాలు ఇప్పిస్తామని అమాయకపు రైతులను దళారులు మోసం చేస్తున్నారు. రైతులనుంచి వేల రూపాయలు దండుకుంటున్నారు. దళారుల ఆట కట్టించేందుకు పోలీసులు రైతుల వేషంలో ఆపరేషన్ నిర్వహించారు. దోపిడీదారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైతులను మోసం చేసిన 30మంది దళారులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల్లో దళారుల హవా జోరుగు నడుస్తోంది. రైతుల రుణాలు ముందుగా తీరుస్తున్నారు దళారులు. తర్వాతరు వారిపేరు రుణాలు ఇప్పించి 30 శాతం వాటా తీసుకుంటున్నారు. లక్ష రూపాయల రుణం తీసుకుంటే దాదాపు 30 వేల రూపాయలు దళారులే తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు దళారుల ఆటకట్టించారు. రైతుల వేషంలో వెళ్లిన పోలీసులు దళారులను దళారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో రైతులను మోసం చేసిన 30 మంది దళారులను అరెస్ట్ చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కేసులో బ్యాంకు అధికారులకు సంబంధం ఉంటే వారిపైకూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు.