డబ్బుల కోసం విలేకరుల బ్లాక్మెయిల్ .. ముగ్గురిపై కేసు నమోదు

డబ్బుల కోసం విలేకరుల బ్లాక్మెయిల్ .. ముగ్గురిపై కేసు నమోదు

ఘట్కేసర్, వెలుగు: ఓ ఇంటి యజమానిని డబ్బుల కోసం బ్లాక్​మెయిల్​ చేసిన ఇద్దరు విలేకరులతో పాటు ఓ యూట్యూబర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్​కేసర్ మున్సిపాలిటీ, ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన పడకంటి నర్సింహ్మచారి జగదాంబ థియేటర్ సమీపంలో ఓ బిల్డింగ్​ నిర్మిస్తున్నాడు. ఆయన వద్దకు ఓ పేపర్​, ఓ చానల్​లో రిపోర్టర్లుగా పనిచేస్తున్న కార్తీక్​, వేణు, యూట్యూబర్​ సుందర్ వచ్చి అనుమతులు లేకుండా భవనం ఎలా కడుతున్నావని బెదిరించారు. 

తాము 8 మంది ఉన్నామని, తలా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేదంటే అధికారులకు చెప్పి భవనం కూల్చివేయిస్తామని హెచ్చరించారు. దీంతో యజమాని బుధవారం  సాయత్రం పోలీసులను ఆశ్రయించారు. వారు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.