జగిత్యాల వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో .. నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోలీస్ ఎంక్వైరీ

జగిత్యాల వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో .. నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోలీస్ ఎంక్వైరీ
  • జగిత్యాల వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిధుల పక్కదారిపై ఆఫీసర్ల ఫిర్యాదుతో రంగంలోకి ఎస్పీ
  • నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై త్రిసభ్య కమిటీ ఏర్పాటు 
  • ఏడాదైనా పూర్తికాని ఎంక్వైరీ 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల వైద్య విధాన్ పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారంపై పోలీసులు ఎంక్వైరీకి సిద్ధమవుతున్నారు. గతంలో ఈ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు రూ.7కోట్లు పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతేడాది వేసిన త్రిసభ్య కమిటీ ఎంక్వైరీ చేసి రూ.రెండున్నర కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. కాగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగకపోవడంపై  టీవీవీపీ ఆఫీస్​కు చెందిన ఓ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  

వోచర్లను దిద్ది నిధులు పక్కదారి 

వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతేడాది నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహరం జగిత్యాలలో సంచలనం కలిగించింది. బ్యాంకు వోచర్లపై రూ.8 వేలుగా ఉండగా, పెన్నుతో రూ.28 లక్షలుగా దిద్ది ఆ డిపార్ట్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వినియోగంలో లేని మరో అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జమ చేశారు. నిధుల పక్కదారిపై గతేడాది ఎంక్వైరీకి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రికార్డు అసిస్టెంట్ యాసిన్ ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు గతేడాది జూన్ 14న కమిటీ సభ్యులు గుర్తించారు. ఎంప్లాయిస్ ఖాతాలో జమ చేయాల్సిన డీఏ, ఎరియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీఎస్ ఎరియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెగ్యులర్ సీపీఎస్, వివిధ డిడక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన దాదాపు రూ.7 కోట్లు పక్కదారి పట్టించినట్లు కమిటీ సభ్యులు ప్రాథమికంగా గుర్తించారు.

 అయితే యాసిన్ 2020 నుంచి ఈ లావాదేవీలు పర్యవేక్షిస్తుండగా.. త్రీసభ్య కమిటీ సభ్యులు 2022 నుంచి అడిట్ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సుమారు రూ.7 కోట్లు నిధులు గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగినట్లు గుర్తించి, రూ.రెండున్నర కోట్లు రికవరీ కూడా చేశారు. మరోవైపు 2020, 2021 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ. 2 కోట్ల అక్రమాలు వెలుగులోకి వస్తాయని పలువురు భావిస్తున్నారు. ఈ లెక్కన రూ. 9 కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ అయినట్లు ప్రచారం ఉంది. 

గత నెలలో ఎస్పీకి ఫిర్యాదు 

నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారంపై మే 27న ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వైద్య విధాన పరిషత్ జిల్లా ఆఫీసర్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేపట్టారు. దీనిపై త్రిసభ్య కమిటీ ఆఫీసర్లకు బ్యాంకర్లు సరిగా సహకరించపోవడంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. వినియోగంలో లేని అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జిల్లా ఆఫీసర్ల నుంచి ఎలాంటి లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా ఎలా రీ ఓపెన్ చేశారనేది అనుమానంగా మారింది. ఎవరైనా ఫోర్జరీ సిగ్నేచర్ తో లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే అకౌంట్ రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారా అనేది తేలాల్సి ఉంది.