పేకాట ఆడుతున్న 18 మంది అరెస్ట్

 పేకాట ఆడుతున్న 18 మంది అరెస్ట్
  • 17 మోటార్ సైకిళ్లు, రూ.4.08 లక్షల క్యాష్,1కారు,19 మొబైల్స్ స్వాధీనం

గద్వాల, వెలుగు: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 18 మంది పేకాట రాయుళ్లను  అరెస్ట్​ చేశారు.  ఎస్పీ రితీరాజ్ వివరాల ప్రకారం... ధరూర్ మండలం జాంపల్లి శివారులోని గంజికుంట దగ్గర పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్టు  సమాచారం అందింది.  దీంతో గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  సీఐ శ్రీనివాసులు, ఎస్పీ ఇన్​స్పెక్టర్​  భగవంత్​  రెడ్డి  పేకాట స్థావరంపై దాడి చేశారు.  

పేకాట రాయుళ్లను అరెస్టు చేసి, 17 మోటార్ సైకిళ్లు, రూ.4. 08 లక్షల క్యాష్, ఒక కారు 19 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో గద్వాల మాజీ కౌన్సిలర్ జిమాల్ సింగ్, జాంపల్లి సర్పంచ్ గణపతి తో పాటు మహబూబ్ నగర్, కర్ణాటక గద్వాల ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.