బస్వాపూర్లో 25 తులాల బంగారం పట్టివేత

బస్వాపూర్లో 25 తులాల బంగారం పట్టివేత

కోహెడ, వెలుగు: మండలంలోని బస్వాపూర్​ దగ్గర శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో ఎలాంటి ఆధారాలు లేని 25 తులాల బంగారాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నంగునూర్​ మండలం అక్కెనపల్లికి చెందిన శ్రీహరి కరీంనగర్​ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా రూ.16.25 లక్షల విలువ గల బంగారాన్ని గుర్తించి సీజ్ ​చేసినట్లు ఎస్ఐ తిరుపతి పేర్కొన్నారు.