పరిగి, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిస్వార్థంగా పనిచేస్తారని వికారాబాద్ ఎస్సీ కె.నారాయణరెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్రెడ్డి అన్నారు. ఫ్లాగ్ డేను పురస్కరించుకుని బుధవారం పరిగిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. సమాజానికి రక్షణగా నిలిచి, విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసులు సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్రెడ్డి, డివిజన్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
