ముందు కరోనా వ్యాక్సినేషన్ తర్వాత పోలియో టీకాల కార్యక్రమం

ముందు కరోనా వ్యాక్సినేషన్ తర్వాత పోలియో టీకాల కార్యక్రమం

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి భారత్ లో దశల వారీగా కరోనా వ్యాక్సినేషన్ అమలు చేయనున్నారు. అయితే.. ఈ నెల 19న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం భావించినా, కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. కరోనా మొదటి దశ వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత జనవరి 31న పోలియో టీకాల కార్యక్రమం ఉంటుందని కేంద్రం ప్రకటించింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అందించాల్సి రావడం అత్యవసర విషయం కావడంతో ఆ కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు పోలియో టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.