అప్పుడు రజనీ, ఇప్పుడు తుమ్మల. సిబ్బంది పై చర్య?

అప్పుడు రజనీ, ఇప్పుడు తుమ్మల. సిబ్బంది పై చర్య?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విషయంలో ఎడమ కుడి అయ్యింది. శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తుమ్మల ఓటేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ కేంద్రంలో తుమ్మల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఆ సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన ఎడమ చేతి వేలికి బదులుగా కుడిచేతి వేలికి సిరా గుర్తు వేశారు. గత నెలలో తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో కూడా ఎన్నికల సిబ్బంది సినీనటుడు రజనీకాంత్‌ ఎడమ చేతికి కాకుండా కుడిచేతి వేలికి  సిరా గుర్తు వేశారు. దీంతో అధికారులు అక్కడి సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.  ఈసారి ఇక్కడి సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.