
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ డిప్లొమా కోర్సులకు టీఎస్ పాలీసెట్ గేట్వేగా మారింది. టెన్త్ తర్వాత రాసే ఈ ఎంట్రెన్స్తో వివిధ రకాల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. ఈ ఏడాది బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలకు కూడా పాలీసెట్ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకోనున్నారు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పాలీసెట్) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్–ఎయిడెడ్ ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ వర్సిటీ(పీజేటీఎస్ఏయూ), పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్ఆర్టీవీయూ) పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. బాసరలోని రాజీవ్గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో అడ్మిషన్లకు కూడా ఈ ఏడాది ‘పాలిసెట్’ను ప్రాథమిక అర్హత పరీక్షగా నిర్ణయించారు.
ఇంజినీరింగ్ డిప్లొమా
రాష్ర్టంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) దాదాపు 38 ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తోంది.పాలీసెట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలు అన్నీ కలిపి రాష్ర్టంలో దాదాపు 260 పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటిలో 40 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా తర్వాత బీటెక్/బీఈ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ స్కీం(ఈసెట్) ద్వారా నేరుగా సెకండియర్లో చేరొచ్చు.
ఆర్జీయూకేటీలో
బాసర ఆర్జీయూకేటీ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు పాలీసెట్ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రీ యూనివర్సిటీ కోర్సు, బీటెక్ రెండు కేటగిరీలు ఉంటాయి. ప్రీ యూనివర్సిటీ కోర్సు ఇంటర్మీడియట్ లాగా రెండేళ్ల ఎంపీసీ కోర్సు. బీటెక్ నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు. ఇందులో కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్ & మెటీరియల్స్, మెకానికల్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ తదితర సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీలో మొత్తం 1500 సీట్లు ఉన్నాయి.
పీజేటీఎస్ఏయూ అగ్రికల్చరల్ డిప్లొమా
గతేడాది నుంచి ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా అడ్మిషన్లకు పాలీసెట్ ర్యాంకును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అగ్రికల్చరల్ డిప్లొమాలో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా(రెండేళ్లు)లో 60 సీట్లు, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డిప్లొమా(మూడేళ్లు)లో 110 సీట్లు ఉన్నాయి.
పీజేటీఎస్ఏయూ వెటర్నరీ డిప్లొమా
పాలీసెట్ ద్వారా పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ (రెండేళ్లు), ఫిషరీస్ పాలిటెక్నిక్(రెండేళ్లు) ప్రవేశాలు పొందవచ్చు. ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్లలో మొత్తం 120 సీట్లు అందుబాటులోఉండగా, ఫిషరీస్ పాలిటెక్నిక్ మాత్రం ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కొలాబరేషన్తో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం సీట్లలో తెలంగాణ స్టూడెంట్స్కు 11 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నోటిఫికేషన్
టెస్ట్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
ఫీజు: రూ.400, ఎస్సీ/ఎస్టీలకు రూ.250
చివరితేది: జూన్ 25(రూ.100 లేట్ ఫీజుతో జూన్ 27, రూ.300 లేట్ ఫీజుతో జూన్ 30)
వెబ్సైట్: www.sbtet.telangana.gov.in
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్