ధైర్యముంటే సిట్టింగులకు టికెట్లివ్వండి :  పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ధైర్యముంటే సిట్టింగులకు టికెట్లివ్వండి :  పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం కార్పొరేషన్ /కూసుమంచి  వెలుగు : బీఆర్ఎస్​కు కౌంట్ డౌన్ మొదలైందని, సీఎం కేసీఆర్​కు ధైర్యముంటే103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్​విసిరారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత  పొంగులేటి గురువారం మొదటిసారి ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​ను గద్దె దించడమే తమ లక్ష్యమని, దాని కోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతానన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్​లో ఎలాంటి వర్గాలు లేవని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్​అధ్యక్షుడు మహ్మద్​జావీద్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్​నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్​కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, బానోత్​ విజయబాయి, మువ్వా విజయబాబు పాల్గొన్నారు.

జీపీ కార్మికులకు అండగా ఉంటా

కొన్నిరోజులుగా సమ్మె చేస్తున్న కూసుమంచి మండలంలోని పంచాయతీ కార్మికులు గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమను పర్మినెంట్​చేసి, జీతాలు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీ కార్మికులకు అండగా ఉంటానని చెప్పారు.