ప్రధానిని కలిసిన పొంగులేటి కుటుంబ సభ్యులు

ప్రధానిని కలిసిన  పొంగులేటి కుటుంబ సభ్యులు

బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్ లోని పీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి.. ఈ మధ్యే పెళ్లయిన తన కూతురు రుచిత, అల్లుడు జోతిన్ లను మోదీకి పరిచయం చేయగా.. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

సుధాకర్ రెడ్డి వియ్యంకుడు వెదిరె అరవింద్ రెడ్డి, ఆయన సతీమణి కూడా ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచి, మోదీ మూడోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. 

న్యూఢిల్లీ, వెలుగు