- బండి సంజయ్.. నేను అనని మాటలను తప్పుగా ప్రచారం చేస్తవా
- అమ్మ ప్రస్తావన తెచ్చి ఇప్పుడెమో కాళ్లు మొక్కుతా అంటవా
- మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ: -రాముని జన్మభూమి ఎక్కడని తాను అనని మాటలను బండి సంజయ్ తప్పుగా ప్రచారం చేస్తున్నాడని, -ఒక వేళ అన్నానని నిరూపిస్తే సజీవ దహనానికి తాను సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. హుస్నాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద - అమ్మ ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడేమో మళ్లీ కాళ్లు మొక్కుతా అంటున్నవా అని ఫైర్అయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ప్రభాకర్మాట్లాడుతూ ‘నేను హిందువుని. మాంసాహారం కూడా తినను. మందు తాగను. రాజన్న గుడికి నీవు ఏం చేశావ్ బండి సంజయ్..- ఏనాడూ అయిన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నామా?- ఎన్నికల్లో ఓట్ల కోసం పెండ్లాం మంగళ సూత్రాలు అమ్ముకున్న నీవు ఇలా మాట్లాడుతావా.-- ఎంపీగా గెలిస్తే నన్ను రాజీనామా చేస్తావా అంటావా సిగ్గు ఉందా? 300 మంది పోలీసులతో యాత్ర చేస్తున్నావ్? నువ్వెప్పుడూ మతపరమైన అంశాలతో రాజకీయం చేస్తున్నావ్ అని ఫైర్అయ్యారు.