
కొన్నేళ్లుగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తోంది పూజాహెగ్డే. తన ఖాతాలో మరో సినిమా చేరబోతోంది. త్వరలో నితిన్కి జంటగా నటించనుందని టాక్. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టిన నితిన్, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా పూజాహెగ్డేని తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావలసి ఉంది. కొన్నాళ్లుగా లవ్ స్టోరీస్ తగ్గించి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలపై దృష్టి పెట్టాడు నితిన్. ఆ లెక్కన ఈ చిత్రంలో పూజ పాత్రకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక ఆమె అఖిల్కి జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్కి రెడీగా ఉంది. రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు లైన్లో ఉన్నాయి. మరో స్టార్ హీరో చిత్రంలోనూ పూజ ఫైనల్ అయ్యిందంటున్నారు. ఇప్పుడీ వరుసలో నితిన్ సినిమా కూడా చేరబోతోంది. ప్రస్తుతం విజయ్తో కలిసి తమిళ చిత్రం ‘బీస్ట్’ షూటింగ్లో పాల్గొంటోంది పూజ. మరోవైపు సర్కస్, భాయిజాన్ లాంటి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లోనూ నటిస్తోంది.