
హైదరాబాద్, వెలుగు : పవర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ల రీకాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మహీంద్రా పవరాల్ డీజిల్ జనరేటర్లను హైదరాబాద్ మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. తాము మహీంద్రా పవరాల్ జెన్సెట్కు ఒరిజనల్ ఎక్విప్మెంట్మాన్యుఫాక్చరర్(ఓఈఎం) అని తెలిపింది. ఈ జెన్సెట్లను సీపీసీబీ4 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని తెలిపింది.
ఇవి 625 కేవీఏ వరకు కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ధరలు రూ.1.5 లక్షల నుంచి మొదలవుతాయి. హైదరాబాద్ ప్లాంటులో వీటిని తయారు చేశామని రీకాన్ తెలిపింది. దీని కోసం రూ.12 కోట్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపింది. జెన్సెట్ మార్కెట్లో తమకు 23 శాతం వాటా ఉందని మహీంద్రా తెలిపింది.