ఐమ్యాక్స్ ధియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేదా.. ఎందుకు

ఐమ్యాక్స్ ధియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేదా.. ఎందుకు

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన మూవీ రెండు ట్రైలర్స్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు అనుకుంటున్నారు. ఆది పురుష్ చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌, ఐ మాక్స్ లో రూపొందించి రిలీజ్ కు రెడీ చేస్తున్నారని ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి.  అందుకు సంబంధించిన ప‌నులు లాస్ ఏంజెల్స్‌లో జ‌రిగాయి.అయితే ఇప్పుడు ఇండియాలో  ఐ మాక్స్ వెర్షన్ కాన్సిల్ అయ్యిందని అని సమాచారం. దీనికి కారణం  హాలీవుడ్ మూవీ  ది ఫ్లాష్ మూవీ అని తెలుస్తోంది.  

ఆ స్క్రీన్లన్నీ హాలీవుడ్ మూవీ ఫ్లాష్ కోసం ఎప్పుడో బ్లాక్ చేశారని సమాచారం. ఐమాక్స్ రూల్స్  ప్రకారం ఒకే సమయంలో రెండు సినిమాలు ఆ ఫార్మాట్ లో వేయడానికి వీలు పడదు. నిజానికి ఆదిపురుష్ ముందు అనుకున్న తేదీ 2023 సంక్రాంతికి. దానికి అనుగుణంగానే అప్పటి పోస్టర్లలో ఐమాక్స్ లోగోతో పాటు ప్రమోషన్లు చేశారు మేకర్స్..  కానీ ఊహించని విధంగా సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఐమాక్స్ స్క్రీన్లు దొరకకుండా పోయాయి. ది ఫ్లాష్ మూవీ 2023 జూన్ 12 న భారీగా రిలీజైంది. 

ఆదిపురుష్  ఐ మాక్స్ వెర్షన్ కాన్సిల్ కావడం మన తెలుగుకి పెద్దగా వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ లేదు. ఇక తెలంగాణాలో  ఉన్నది ఒక్కటే.. అది హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నది, సూళ్లూరుపేటలో యువీ వాళ్ళు స్థాపించివి పెద్ద తెరలే కానీ వాటికి ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ ఉండదు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోచి లాంటి నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడ ది ఫ్లాష్ స్క్రీనింగ్ ఉంటుంది.  
.
రామాయణం ఇతిహాస కథతో వస్తున్న ఆదిపురుష్  సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తు్ండగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు రాముడి కథని చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరు టికెట్స్ ని బుక్ చేసేసుకుంటున్నారు.