
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ శనివారం గ్రాండ్గా జరిగింది. హీరోహీరోయిన్స్ ప్రభాస్, ఇమాన్వితో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్తో పాటు ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హాజరయ్యారు.
హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఈ లార్జర్ దేన్ లైఫ్ మూవీని తెరకెక్కించనున్నట్టు నిర్మాతలు తెలియజేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. 1940 నాటి చారిత్రక నేపథ్యంలో పవర్ఫుల్ వారియర్ స్క్రిప్ట్ని ప్రభాస్ కోసం హను రాఘవపూడి సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.