ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం సినీ ప్రముఖులు తమ వంతుగా చేయూతనిస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ నటుడు ప్రభాస్ కూడా భారీ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు.బాధితులకు సాయంగా కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించాడు.
సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ప్రభాస్ గతంలో కరోనా సమయంలోనూ, హైదరాబాద్ నగరం వరదల్లో మునిగినప్పుడు కోటి రూపాయలు, కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్లు విరాళం అందించాడు. లేటెస్ట్గా ఇప్పుడు కూడా వరదల్లో బాధపడుతున్నవారికి అండగా నిలవడానికి కోటి రూపాయలు సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు రూ. 25 లక్షల చొప్పున విరాళం అందించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు వీరు ఈ విరాళాన్ని అందించారు.