దివంగత ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబాన్ని డార్లింగ్ ప్రభాస్ పరామర్శించారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసారు. సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో సిరివెన్నెల సీతాారామశాస్త్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబర్ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది అనే సాంగ్ ను సిరివెన్నెల రాశారు. మరో వైపు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Actor #Prabhas personally Visited the family of late legendary lyricist #SirivennelaSeetharamaSastry garu
— World Of Prabhas™ (@_WorldOfPrabhas) January 4, 2022
pic.twitter.com/MSKq9TdqlO