
హైదరాబాద్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను తొందరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై జనాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 398 అర్జీలు వచ్చాయన్నారు.
రంగారెడ్డి కలెక్టరేట్లో..
కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 498 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు. ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు.